
కోటగిరి,వెలుగు : మద్నూర్ నుంచి రుద్రూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణం వల్ల పోతంగల్ మండలంలో కోల్పోతున్న భూముల వివరాలు, సర్వే చేసి నివేదిక అందజేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో రెవెన్యూ అధికారులకు సూచించారు.
గురువారం పోతంగల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడారు. ధరణి పెండింగ్ ఫైల్స్ గురించి ఆరా తీసి, త్వరగా పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.